టిఆర్ఎస్ కు చెందిన నలుగురు శాసనసభ్యులు తమను కొంత మంది పార్టీ ఫిరాయించమని ప్రలోభపెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం పై బిజెపి నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇదంతా కెసిఆర్ డ్రామగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, ఎంపి అర్వింద్ వ్యాఖ్యానించారు. బిజెపి నేత చింతల రామచంద్రరెడ్డి టిఆర్ఎస్ శాసనసభ్యులకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ కు మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇటువంటి డ్రామాలు కెసిఆర్ కు అలవాటేనని విజయశాంతి కొట్టిపారేశారు. ఎండ్స్