నీటి పారుదల శాఖలో భారీ ప్రక్షాళన..ఈఎన్ సి రాజీనామా

నీటి పారుదల శాఖ లో భారీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వ చర్యలు. .ఈఎన్సీ లపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ చర్యలతో చర్యలతో రాష్ట్రంలో సంచలనం.. కాళేశ్వరం ప్రాజెక్టు మెడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన అంశంపై ప్రభుత్వం చాలా సీరియస్.. విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.. మెడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన అంశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రుల బృందం స్వయంగా మెడిగడ్డ తోపాటు బ్యారేజ్ లను సందర్శించి డ్యామేజ్ లను పరిశీలించారు.. విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి అందడంతో అధికారులపై చర్యలు

నీటి పారుదల శాఖ ఈఎన్ సి మురళీధర్ రావ్ ను రాజీనామా చేయాలని ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

కాళేశ్వరం ఇంచార్జ్ ఈఎన్ సి వెంకటేశ్వర్ రావ్ ను సర్వీసు నుంచి తొలగిస్తూ తీవ్రమైన చర్యలు తీస్కున్న ప్రభుత్వం..

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపత్యంలో ప్రభుత్వం నీటి పారుదల శాఖ లో ప్రక్షాళన చేయడంలో సంచలనంగా మారిన వ్యవహారం..

కాళేశ్వరం అవినీతి విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకోవడంతో ఇంకా ఎంత మందిపై చర్యలు ఉంటాయోనని చర్చ… రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలలో నీటి పారుదల పై శ్వేత పత్రం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.శ్వేతపత్రం ముందే భారీ చర్యలకు ప్రభుత్వం పూనుకోవడంతో రాష్ట్రంలో సంచలన అంశంగా మారిపోయిన కాళేశ్వరం వ్యవహారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *