సిఎం రేవంత్ తో చిన్నజీయర్ స్వామి భేటి

రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని ప్రముఖ ఆద్యాత్మిక వేత్త, వైష్ణవ మతాచార్యులు చిన్నజీయర్ స్వామిని సోమవారం నాడు కలిశారు. ఆయన ఆశ్శీస్సులు స్వీకరించారు.టిపిసిసి అధ్యక్షుడి హోదాలో రాజకీయంగా తెలంగాణ అధ్యాత్మిక విషయాలలో, యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మర్చమని అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ కు చిన్నజీయర్ స్వామి సలహా ఇవ్వగా చిన్నజీయర్ జోక్యం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. రామానుజల వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నేపధ్యంలో చిన్నజీయర్ స్వామికి కెసిఆర్ దూరమయ్యారనే ప్రచారం సాగింది. ఆతరువాత కెసిఆర్ –చిన్నజీయర్ స్వామి లు కలిసి పాల్గొన్న కార్యక్రమాలు లేవు. అయితే శాసనసభ ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన అనంతరం రేవంత్ ను చిన్నజీయర్ స్వామి కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎండ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *