వారం రోజులలో మరో రెండు గ్యారంటీలు…. సిఎం రేవంత్

వారం రోజులలో మరో రెండు గ్యారంటీలు…. రేవంత్

రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బుధవారం నాడు తన స్వంత నియోజకవర్గమైన కొడంగల్ లో పర్యటించారు. పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం కొనసాగించారు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసే వంశీచంద్ రెడ్డికి కొడంగల్  అసెంబ్లీ సెగ్నెంట్ లో 50 వేల మెజారిటీ అదించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  అనేక కార్యక్రమాలకు ఆయన శంఖుస్థాపన చేశారు. రాష్ట్ర శాసనభ స్పీకర్ జి ప్రసాద్ రావు, భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తంకుమార్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు వేదికను ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొన్నారు.    

తమ ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసిందని తెలియజేశారు. మరో రెండు గ్యారంటీలైన రూపాయలు ఐదు వందలకే వంటగ్యాస్ సిలెండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పథకాన్ని వారం రోజులలో ప్రారంభిస్తామని ప్రకటించారు. రైతు భరోస, రెండు లక్ష రూపాయల వరకు రుణ మాఫి పథకాన్ని మార్చి 15వ తేదీ నుంచి అమలు చేస్తామని తెలియజేశారు. బిఆర్ఎస్ –బిజెపి రెండు ఒక్కటే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పాలమురు కు చేసిందేమి లేదు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి బిజెపికి నలుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నా కేంద్రం నుంచి నాలుగు రూపాయలకు కూడ తీసుకుని రాలేదని అన్నారు. బిఆర్ఎస్ ఓట్లు అడిగే అర్హత లేదని విమర్శించారు. బిఆర్ఎస్ పదేళ్ళపాటు అధికారంలో ఉండి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు. బిజెపి-బిఆర్ఎస్ లు కలిసి ఎన్ని వ్యూహాలు పన్నినా ప్రజల అప్రమత్తతో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం సాధ్యమైందని అన్నారు.

ఎండ్స్   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *