తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా నెల్లురు జిల్లా కందుకూరులో బుధవారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జరిగిన తోపులాటలో కాలువలో పడి ఏడుగురు మృతిచెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. చంద్రబాబు నాయుడు బహిరంగ సభను రద్దు చేశారు. బహిరంగ సభను సంతాప సభగా మార్చారు. మృతులకు నివాళులర్పించారు. చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ వారిని పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించడంతోపాటు మృతుల పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యాసంస్థల్లో ఉచిత విద్యా సౌకర్యం కల్పిస్తామని ఆయన ప్రకటించారు.
ReplyForward |