కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు దళితులకు, ఆదివాసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో చెబుతూనే తాను కూడ దళితులకే అగ్రతాంబులం ఇవ్వనున్నట్టు ఎన్నో సార్లు ప్రకటించి తనకు ఏ అవకాశం వచ్చినా మొదట శాసనసభ్యురాలు సీతక్కకే అప్పగిస్తానని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక సార్లు స్ఫష్టం చేసిన విషయం తెలిసిందే. పూర్వపు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో కూడ అధ్యక్ష బాధ్యతలను సీతక్కకే అప్పగించారు. దీనితో దళితులు, ఆదివాసీలు, గిరిజనులలో ఆయన విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. ఇందులో సఫలీకృతమయ్యారని కూడ చెప్పకతప్పదు. సీతక్క ఇప్పటికే తన దైన శైలీలో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం విమర్శల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఉన్న నాయకులపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ప్రస్తుతం ఉన్న నేతలను వారి పదవులలోనే కూర్చోబెడుతూ కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం పైన కూడ రేవంత్ రెడ్డి దృష్టిని కేంద్రీకరించినట్టుగా కనిపిస్తోంది. ఎండ్స్