ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయన కుమారుడు చింతకాయల రాజేష్ ను గురువారం సిఐడి పోలీసులు నోటీసు ఇచ్చి అరెస్ట్ చేశారు.
వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేశారు. . ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించిన విషయంలో అయ్యన్నపాత్రుడు ఫోర్జరీ పత్రాలను సమర్పించారని అనే అభియోగంపై సిఐడి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తాము పోలీసులకి సహకరిస్తామని చెప్పినా కూడా అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి , పోలీసులు దుస్తులు కూడా మార్చుకొని ఇవ్వకుండా తన భర్తను అరెస్టు చేసి తీసుకుని వెళ్లారని అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి ఆరోపించారు తన భర్త ఆరోగ్యం భద్రత విషయంలో పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు