నాకు మీరు సన్మానం చేస్తున్నారు.అంతగా అదిప్పుడు అవసరంలేదు.మనిషి చనిపోయాక అప్పుడు బయటికి వస్తుంది అసలు చిత్రం.ఆ మనిషి ని అప్పుడు మాత్రమే సరిగా అంచనా వేయగలం. ఎందుకంటే బుద్ధి వక్రించి చివరి రోజుల్లో కూడా తప్పులు చేయొచ్చు. అప్పుడు మాత్రమే ఆ మనిషి సరైన మార్గంలో ఎంతవరకు నిలిచాడని చెప్పడం సులభం. కాబట్టి ఏతప్పులు చేయకుండా నిస్స్వార్థంతో ప్రజలసేవ చేసే అవకాశం ఇవ్వమని మనం భగవంతుణ్ణి ప్రార్థించాలిసర్దార్( 1950 లో హైదరాబాద్,సికింద్రాబాదు మున్సిపాలిటీకి, హిందీ ప్రచారసభ సన్మాన పత్రం ఇచ్చినపుడు)